Thursday, May 2, 2024

Liquor Scam – మాగుంట రాఘ‌వ‌కు తాత్క‌లిక బెయిల్ మంజూరు ….

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాగుంట రాఘవకు బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు. అనారోగ్య కారణాలతో నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. కాగా, గతంలో బెయిల్ మంజూరు చేయడంపై అభ్యంతరం తెలిపిన ఈడీ ఈసారి మాత్రం ఎలాంటి అభ్యంతరం తెలుపలేదు.

ఇక ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దినేష్ అరోరా అప్రూవర్‌గా మారాడు. మరోవైపు ఇటీవలే ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనిష్ సిసోడియా, మరికొందరి ఆస్తులను ఈడీ అటాక్ చేసిన విషయం తెలిసిందే. అలాగే సిసోడియా బెయిల్ పిటిష‌న్ కూడా ఈ వారంలో విచార‌ణ‌కు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement