Wednesday, May 15, 2024

మెట్లపై నుంచి జారిపడ్డ లాలూ.. భుజానికి ఫ్రాక్చర్‌, వెన్నెముకకూ గాయాలు

బీహార్‌ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ మెట్లపై నుంచి జారి పడటంతో ఆయన భుజానికి ఫ్రాక్చర్‌ అయ్యింది. వెన్నెముకకూ స్వల్ప గాయాలయ్యాయి. తన సతీమణి, మాజీ సీఎం రబ్రీదేవి అధికారిక నివాసంలో ఈ ఘటన జరిగింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి కట్టు కట్టించామని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఐసీయులో చికిత్స తీసుకుంటున్నట్టు ఆసుపత్రి అధి కారి ఒకరు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ఢిల్లిలోని ఆసుపత్రికి తీసుకు వెళ్లాల్సి ఉంటుందా అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు.

కాగా ఆసుపత్రిలో లాలూ వెంట ఆయన భార్య రబ్రీదేవి, కుమారులు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌, తేజస్వియాదవ్‌ ఉన్నారు. పశుగ్రాసం కుంభకోణంలో ప్రస్తుతం లాలూ బెయిలుపై ఉన్నారు. కిడ్నీ మార్పిడి కోసం సింగపూర్‌ వెళ్లేందుకు జార్ఖండ్‌ హైకోర్టు అనుమతించడంతో ఆయనకు బెయిల్‌ లభించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement