Saturday, May 4, 2024

కోలుకుంటున్న లాలూ

బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు ఆయ‌న కుమార్తె మీసా భార‌తి వెల్ల‌డించారు. గ‌తంలో కంటే లాలూ ఆరోగ్యం ప్ర‌స్తుతం బెట‌ర్‌గా ఉంద‌ని భార‌తి పేర్కొన్నారు. ప్ర‌స్తుతం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. గ‌త వారం లాలూ త‌న ఇంట్లోనే మెట్లు ఎక్కుతుండ‌గా జారి ప‌డ్డారు. దీంతో ఆయ‌న‌ను హుటాహుటిన చికిత్స నిమిత్తం పాట్నాలోని పారాస్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. లాలూ భుజం, వెన్నెముక‌కు తీవ్ర గాయ‌మైన‌ట్లు డాక్ట‌ర్లు నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం ఢిల్లీ ఎయిమ్స్‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement