Friday, April 26, 2024

వైఎస్ ఆశయం సిద్ధించిన రోజే ఆయనకు నిజమైన నివాళి – రేవంత్ రెడ్డి

ప్రాంతాల‌కు అతీతంగా పేద‌వాడి గుండెల్లో సంక్షేమ సంత‌కం వైఎస్ ఆర్ అని అభివ‌ర్ణించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నేడు దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జ‌యంతి. ఈ మేర‌కు హైదరాబాదులో వైఎస్ విగ్రహానికి పూల‌మాల వేసి అంజలి ఘటించారు. అంతకుముందు గాంధీ భవన్ లో వైఎస్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రేవంత్ తో పాటు భట్టి విక్రమార్క, కేవీపీ రామచంద్రరావు, అంజన్ కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, విజయారెడ్డి తదితర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అనంతరం రేవంత్ ట్విట్టర్ లో తన మనోభావాలను పంచుకున్నారు. చివరి శ్వాస వరకు కాంగ్రెస్ ఉన్నతి కోసం తప్పించిన నేత ఆయన అని కీర్తించారు. రాహుల్ గాంధీని ఈ దేశ ప్రధానిగా చూడాలన్నది వైఎస్ ఆశయం అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. వైఎస్ ఆశయ సాధన కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ఆయన అభిమానులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ ఆశయం సిద్ధించిన రోజే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement