Sunday, April 28, 2024

Kodali Nani అప్పుడు గాలికొదిలేసి ఇప్ప‌డు బిసి భ‌జ‌న చేస్తే ఎవ‌రు న‌మ్ముతారు…. చంద్ర‌బాబుకు కొడాలి నానీ కౌంట‌ర్

గుడివాడ – అధికారంలో ఉన్నప్పుడు గాలికి వదిలేసి, ఇప్పుడు బీసీ భజన చేసే చంద్ర‌బాబుని ఎవరూ నమ్మర‌ని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్యానించారు… గుడివాడ‌లో శుక్ర‌వారం నాడు మీడియాతో మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ లాంటి కాపు సామాజికి వ్య‌క్తిని వెనకాల పెట్టుకొని తిరుగుతున్న చంద్రబాబు, బీసీలు వెన్నెముక అని ఎలా చెప్తారు అని ప్ర‌శ్నించారు. ఎన్టీఆర్ ఏర్పాటుచేసిన కార్యక్రమాలను కొనసాగించడం తప్ప.. బీసీల కోసం చంద్రబాబు ఏం పాటు పడ్డారో చెప్పాలని డిమాండ్ చేశారు.

బిసిల‌కు న్యాయం చేస్తున్న‌ది జ‌గ‌నే ..

ఓసీ రిజర్వుడు పదవులను కూడా ఇస్తూ.. బీసీలకు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రాధాన్యతనిస్తున్నారని ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్ నాలుగు రాజ్యసభలు బీసీలకు ఇస్తే.. 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబు ఒక్క బీసీకైనా రాజ్యసభ ఇచ్చారా..? అని నిలదీశారు. విద్య, వైద్యాన్ని అందుబాటులోకి తేవడంతో పాటు బీసీల ఆర్థిక ఉన్నతికి సీఎం వైఎస్‌ జగన్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు.. 2024లో చంద్రబాబు, దత్తపుత్రుడి మబ్బులన్నీ విడిపోతాయని భ‌విష్యవాణిని వినిపించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement