Tuesday, May 7, 2024

Congresss – ఆరు గ్యారంటీలనుఅమలు చేస్తాం – మంత్రి దామోదర రాజ‌న‌ర్సింహా

ఆందోల్ – రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. శుక్రవారం అందోల్-జోగిపేట మున్సిపల్ పరిధిలోని 17,18వ వార్డులలో ప్రజా పాలన అభయహస్తం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రజల నుంచి ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందోల్ నియోజకవర్గ ప్రజలు నాకు సేవ చేసేందుకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ రుణపడి ఉంటానని తెలిపారు. అందోల్‌ను అభివృద్ధి దశలో ముందంజలో ఉంచేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement