Friday, May 3, 2024

ఫ్యామిలీతో జైస‌ల్మేర్ బ‌య‌లుదేరిన.. కియారా అద్వాని

త‌న ఫ్యామిలీతో రాజ‌స్థాన్ జైస‌ల్మేర్ కి బ‌య‌లు దేరింది హీరోయిన్ కియారా అద్వాని.కాగా కియరా అద్వానీ, సిద్ధార్థ్‌ మల్హోత్రాల పెళ్ళి ఎ ఫిబ్రవరి 6న రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని ఓ ప్యాలేస్‌లోజ‌ర‌గ‌నుంది. పంజాబీ సంప్రదాయంలో వీరిపెళ్లిని అంగరంగా వైభవంగా జరిపే విధంగా ఇరు కుటుంబ సభ్యులు ప్యాలేస్‌ను అలకరిస్తున్నారు. ఫిబ్రవరి 4,5 తేదిల్లో మెహెందీ, హల్దీ ఫంక్షన్‌లు జరుగనున్నాయి. ఇక వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులతో పాటు బాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇక టాలీవుడ్‌లోని కొందరు ప్రముఖులకు కూడా ఆహ్వానం అందినట్లు తెలుస్తుంది.పెళ్లి అనంతరం ఢిల్లీ, ముంబైలలో వివాహ రిసెప్షన్లను గ్రాండ్‌గా ఏర్పాటు చేయనున్నట్లు టాక్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement