Saturday, April 20, 2024

లోకేష్ పాదయాత్రపై కొడాలి నాని సెటైర్లు

తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. తాడేపల్లిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ… జగన్ గురించి లోకేష్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడన్నారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్ కు జగన్ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.

లోకేష్ పాదయాత్రలో జనం లేరన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు పాదయాత్ర చేయలేక కొడుకును పంపారన్నారు. జనంలేక ఖాళీ కుర్చీలతో లోకేష్ మాట్లాడుతున్నాడన్నారు. గ్రౌండ్ లో బహిరంగ సభ పెట్టుకోమంటే గల్లీల్లో తిరుగుతున్నాడన్నారు. నారావారి పల్లె నుంచి వలస వెళ్లింది చంద్రబాబేనన్నారు. నిబంధనలు పాటించమంటే పోలీసులను తిడతారన్నారు. రోజుకు పది కిలోమీటర్లు కూడా లోకేష్ నడవలేకపోతున్నాడన్నారు. సీఎం జగన్ పై పడి ఏడవటమే టీడీపీ పని అన్నారు. దత్త పుత్రుడు కూడా హైదరాబాద్ కు వలస వెళ్లిపోయాడన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement