Saturday, May 4, 2024

గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాట్లు చేస్తోన్న కియారా..సిద్ధార్థ్

రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని సూర్యగఢ్‌ ప్యాలెస్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో బాలీవుడ్ నటులు కియారా అద్వాని..సిద్ధార్థ్ మల్హోత్రాల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కాగా ముంబైలోని ఓ హోట‌ల్ లో ఫిబ్ర‌వ‌రి 12 సాయంత్రం 8:30 గంటలకు రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు బాలీవుడ్ న‌టులు..కొత్త జంట కియారా అద్వాని..సిద్ధార్థ్ మ‌ల్హోత్రా. ఈ సందర్భంగా రిసెప్షన్‌ ఏర్పాట్ల కోసం ఈ జంట శనివారం ఢిల్లీ నుంచి ముంబై వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ గ్రాండ్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్‌కు బాలీవుడ్‌ సెలబ్రిటీలు, పలువురు పారిశ్రామివేత్తలు హాజరుకానున్నట్లు స‌మాచారం. ఇందుకు సంబంధించిన ఇన్విటేషన్‌ కార్డు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ రిసెప్షన్‌కు కరణ్‌ జోహార్‌, షాహిద్‌ కపూర్‌, మనీశ్‌ మల్హోత్ర, షారుక్‌ ఖాన్‌, వరుణ్‌ ధావన్‌, అక్షయ్‌ కుమార్‌, పరిణీతి చోప్రా, జుహీ చావ్లా, అనిల్‌ కపూర్‌, అజయ్‌ దేవగణ్‌‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తదితర సెలబ్రిటీలు సహా కుటుంబ సభ్యులు, పలువురు పారిశ్రామిక వేత్తలు హాజరుకానున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement