Saturday, May 18, 2024

యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి సేవలో ఖుషి టీమ్

యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆశీస్సుల వల్లే మా అన్నదమ్ముల సినిమాలు అత్యంత ప్రేక్షకాదరణ పొందాయని ఈ సందర్భంగా అన్నారు హీరో విజయ్ దేవరకొండ. తమ్ముడు ఆనంద్ దేవరకొండ, కుటుంబ సభ్యులు, ఖుషి సినిమా యూనిట్ సభ్యులతో కలిసి బ్రేక్ దర్శనం టైం లో శ్రీ యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్నారు .

విజయ్ దేవరకొండ, ఖుషి సినిమా యూనిట్.కాగా, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కలిసి నటించిన సినిమా ఖుషి. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ ఇద్దరికి ఖుషి చిత్రం కాస్త ఊరటనిచ్చిందని చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 1వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ను సంపాదించుకుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement