Sunday, April 28, 2024

Breaking: జ్ఞానవాపీ మసీదు కేసులో కీలక తీర్పు…

జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లోని ‘వ్యాస్ కా తేఖానా’లో హిందువులు పూజలు చేసుకోవచ్చంటూ వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పును అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. వారణాసి కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలన్న అంజుమన్ ఇంతెజామియా మసీద్ కమిటీ (ఏఐఎంసీ) అభ్యర్థనను తోసిపుచ్చింది. దీంతో అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేయాలని ఏఐఎంసీ నిర్ణయించింది.

తుది వాదనలు విన్న జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ ఈ మేరకు కొద్దిసేపటి క్రితం తీర్పు వెల్లడించారు. కోర్టు తీర్పుపై హిందూ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. మసీదు బేస్‌మెంట్‌లో నాలుగు తేఖానాలు (సెల్లార్‌లు) ఉన్నాయి. అందులో ఒకటి వ్యాస్ కుటుంబం అధీనంలో ఉంది. అయితే మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement