Monday, May 6, 2024

చదువుకున్నవాడు మాకు ఓటు వేయడు… బీజేపీ ఎమ్మెల్యే

కేరళ బిజెపి ఎమ్మెల్యే రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కేరళ లో బిజెపి పుంజుకోకపోవడానికి ప్రధాన కారణం అక్షరాస్యత రేటు అని రాజగోపాల్ వ్యాఖ్యానించారు. కేరళలో అక్షరాస్యత రేటు 90 శాతం ఉందని… అందుకే బిజెపి పుంజుకోలేకపోతుందని ఆయన వ్యాఖ్యలు చేశారు.

ఇక రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో అయితే నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. అంటే చదువుకున్నవారు బిజెపికి ఓటు వేయరా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి రాజగోపాల్ వ్యాఖ్యలపై బిజెపి నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement