Sunday, April 28, 2024

అంగరంగ వైభవంగా కీసర రామలింగేశ్వరస్వామి కళ్యాణోత్సవం..

కళ్యాణోత్సవంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, జిల్లా కలెక్టర్​ హరీశ్​ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి, కలెక్టర్ తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కీసర గుట్ట రామలింగేశ్వరస్వామి కళ్యాణమహోత్సవం వేద బ్రాహ్మణుల మంత్రోచ్చారణలతో సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కుమారులు, కోడల్లు, కుటుంబసభ్యులతో హాజరు కాగా.. మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్​ హరీశ్​లు దంపతులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వేదపండితుల మంత్రోచ్చారణలతో పాటు రంగురంగుల విద్యుద్దీపాల అలంకరణలో రామలింగేశ్వరస్వామిని అందంగా అలంకరించారు. రామలింగేశ్వరస్వామి కళ్యాణం అనంతరం మంత్రి మల్లారెడ్డి, కలెక్టర్​ హరీశ్​లు ఆలయంతో పాటు పరిసరాలను పరిశీలించి మహాశివరాత్రి సందర్భంగా జరగనున్న ఏర్పాట్లను చూశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, ఆలయ కమిటీ ఛైర్మన్, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement