Tuesday, May 21, 2024

Delhi | కవిత ఎక్కడ పోటీ చేసినా ఓడిపోవడం ఖాయం : బీజేపీ ఎంపీ అరవింద్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఎమ్మెల్సీ కవిత లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కణ్నుంచి పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమని బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జోస్యం చెప్పారు. బుధవారం ఆయన పార్లమెంట్ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు. కవిత మాట తండ్రి కేసీఆరే వినలేదని, ఇకనైనా ఆమె డ్రామాలు ఆపాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఏం చేసిందో చెప్పాలని అరవింద్ డిమాండ్ చేశారు.

ఇకనైనా ఆడవాళ్లకు మేలు చేయాలని కవిత కేసీఆర్‌ను డిమాండ్ చేయాలన్నారు. కల్వకుంట్ల కుటుంబం మాటలు తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ ఉద్యమకారులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్‌దని, అనేకమంది ప్రాణత్యాగాలకు సోనియానే కారణమని విమర్శించారు. యువత గురించి మాట్లాడుతున్న కేటీఆర్ తమ కుటుంబం వారి కోసం తొమ్మిదేళ్లలో ఏం చేసిందో చెప్పాలని ఆయన నిలదీశారు. చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా నిలబెట్టుకోని కేటీఆర్ ఏ మొహం పెట్టుకుని ట్వీట్లు చేస్తున్నారని అరవింద్ ప్రశ్నించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement