Sunday, May 19, 2024

మంచు తుఫాన్ లో చిక్కుకున్న ‘కార్తికేయ -2’

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఎప్పుడూ వైవిద్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు. ప్రస్తుతం కార్తికేయ-2 మూవీతో బీజీగా ఉన్నాడు. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాను చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన భారీ షెడ్యూల్ ఒకటి 20 రోజుల పాటు గుజరాత్ లోని ద్వారక, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో జరిగింది. అయితే ఈ నెల 21 కులూమనాలిలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించడం కోసం నిఖిల్ తో పాటు ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణులు హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లారు. అయితే… అక్కడ ఈ చిత్ర బృందం మంచు తుఫాన్ లో చిక్కుకుంది. షూటింగ్ చేయలేని పరిస్థితి నెలకొంది. నాలుగు రోజుల పాటు షూటింగ్ చేసుకుని తిరిగి రావాల్సి ఉండగా, మరికొన్ని రోజులు ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లోని ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ, హీరో నిఖిల్ ఓ వీడియోను పంపారు.

ఒకటి రెండు రోజుల్లో షూటింగ్ జరుపుకునే విధంగా రోడ్లు క్లియర్ అయ్యేలా ఉందని, ఆ తర్వాత యూనిట్ హైదరాబాద్ రాగానే ఇక్కడ ఓ పది రోజులు షూటింగ్ షెడ్యూల్ జరుపుతామని మూవీ టీం చెబుతోంది.

https://twitter.com/baraju_SuperHit/status/1374682770455240704
Advertisement

తాజా వార్తలు

Advertisement