Thursday, May 2, 2024

మంత్రి రాసలీలల వ్యవహారంలో కీలక మలుపు

కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి రాసలీలల వ్యవహారం కేసు కొత్త మలుపు తిరిగింది. బయటకు వచ్చిన రాసలీలల వీడియోలను చూసి తన కుమార్తెకు ఫోన్ చేశానని, ఆ వీడియోలో ఉన్నది తాను కాదని తన కూతురు చెప్పిందని.. ఆమె ఏ తప్పు చేయలేదని వీడియోలో ఉన్న యువతి తండ్రి పేర్కొన్నాడు. అనంతరం తనను కాంటాక్ట్ చేయవద్దని, తాను ప్రమాదంలో ఉన్నానని చెప్పిందన్నాడు. కానీ ఇప్పుడు తన కుమార్తె ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని.. తన కూతురిని ఎవరో కిడ్నాప్ చేశారంటూ యువతి తండ్రి బెళగావి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమార్తె ప్రమాదంలో ఉందని, కాపాడాలని కోరారు. కాగా రాసలీలల వీడియోలు బయటకు రాగానే సదరు యువతి గోవా వెళ్లిందని, అనంతరం బెంగళూరు వచ్చి తలదాచుకున్నట్లు అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement