Saturday, April 27, 2024

Karnataka – పార్టీల‌కు క‌న్న‌డ రైతుల‌ షాక్

క‌ర్నాట‌క‌లోని రైత‌న్న‌లు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. రైతుల బాధలు పట్టించుకోని ఈ రెండు పార్టీలకు లోక్‌సభ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని భావిస్తున్నారు. దీని కోసం రాష్ట్రంలో రైతు సంఘాలన్నీ ఒక్కటవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ‘నోటాస అస్త్రాన్ని ఉపయోగించుకోవాలని ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చారు.. కాగా, ఇప్పటికే క‌ర్న‌డ రాజ్య రైతు సంఘ, హసిరు సేనె సంఘాలు ఎన్డీఏకు వ్యతిరేకంగా ఓటు వేయాలని రాష్ట్రంలోని రైతులను కోరుతూ ప్రచారాన్ని చేస్తున్నాయి.కాంగ్రెస్ కూడా ఏమీ చేయ‌లేద‌న్న రైతు సంఘాలు.. ఇదే సమయంలో క‌ర్నాట‌క‌ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ కూడా రైతులకు చేసిందేమీ లేద‌ని, .. ప్రస్తుతం తీవ్ర కరువును ఎదుర్కొంటున్నా ప్రభుత్వం స్పందించడం లేద‌నే భావనతో పలు రైతు సంఘాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నిక ల్లో రైతులను బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా సంఘటితం చేసేందుకు రైతు సంఘాల నేత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా భారత చెరుకు రైతుల సంఘం ఆధ్వర్యంలో మైసూరులో ఏప్రిల్‌ 3వ తేదీన రైతు సంఘాల సమావేశం జరగబోతుంది. ఈ మీటింగ్ లోనే లోక్‌ సభ ఎన్నికల్లో రైతు సంఘాలు అనుసరించాల్సిన ప్రణాళికను ఖరారు చేసే అవకాశం ఉంది. కాగా, ఇప్పటికే బీజేపీకి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నోటాకు ఓటు వేయాలని రైతు సంఘాలు ప్రతి పాధించే అవకాశం ఉన్నాయి. మెజార్టీ రైతుల అభిప్రాయం మేర‌కు నిర్ణ‌యం తీసుకోవాల‌ని భావిస్తున్నారు అక్క‌డి రైతులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement