Friday, May 3, 2024

జూడాలతో ముగిసిన చర్చలు..

తెలంగాణలో జూనియర్ డాక్టర్ల తో హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ చర్చలు ముగిసాయి. తమ డిమాండ్లపై రాత పూర్వకంగా హామీ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు డాక్టర్లు. ఎక్సగ్రేషియా పై స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు. ఎక్సగ్రేషియా విషయంలో సాంకేతిక సమస్యలు ఉన్నాయి అన్నారు..ఈ విషయంపై జనరల్ బాడీలో చర్చించి సాయంత్రంలోగా సమ్మె కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే జానియర్ డాక్టర్ల డిమాండ్ పై జీవో ఇవ్వడానికి ఒకటి.. రెండు రోజులు పడుతుందని హెల్త్ సెక్రటరీ చెప్పారని తెలిపారు. ప్రజలను ఇబ్బంది పెట్టాలన్నది మా ఉద్దేశ్యం కాదకాదని వారు తెలిపారు. ఇక త్వరలోనే నిమ్స్ బెడ్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు

Advertisement

తాజా వార్తలు

Advertisement