Thursday, May 2, 2024

Judgement – జ్ఞాన‌వాపిలో పూజ‌ల‌కు అనుమ‌తి…వార‌ణాసి కోర్టు సంచ‌ల‌న తీర్పు

జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మసీదులో సీజ్ చేసి ఉంచిన 10 సెల్లార్లలో ఉన్న దేవతల ప్రతిమలకు పూజలు చేసుకునేందుకు హిందువులకు, హిందుసంఘాలకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఇందుకు గాను వారం రోజుల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని వారణాసి కోర్టు ఆదేశించింది. కాగా ఈ తీర్పుపై హిందూ పిటిషనర్ల న్యాయవాది స్పందించారు. కోర్టు తీర్పు వారు కీలక మలుపుగా అభివ‌ర్ణించారు. . దేవతలకు పూజలు చేసే హక్కు ప్రతి హిందువుకు ఉందని ఈ తీర్పుతో తేట‌తెల్ల‌మైంద‌న్నారు..

కాగా, ఈ మసీదు హిందూ దేవాలయంపై కట్టారని.. ఇప్పటికే అందులో దేవాలయం ఆనవాళ్లు ఉన్నాయని కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన కోర్టు మసీదు ప్రాంగణంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో “శాస్త్రీయ పరిశోధన” ఆదేశించింది. దీంతో సర్వే చేపట్టిన ఆ సంస్థ‌ మసీదును దేశాలయంపైనే కట్టారని.. దీనికి తగు ఆనవాళ్లు లభ్యమైనట్లు కోర్టు దృష్టికి తెచ్చారు.. అలాగే కొన్నిదేవ‌తా విగ్ర‌హాలు, శిలా శాస‌నాలు ఇక్క‌డ ల‌భ్య‌మ‌య్యాయంటూ వీడియోల‌ను ఫోటోల‌ను కోర్టుకు స‌మ‌ర్పించిది… ఈ సర్వే ఆధారంగా చేసుకొని వారణాసి కోర్టు ఈ రోజు కీలక తీర్పును ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement