Thursday, May 2, 2024

25, 26 తేదీలలో పాలిటెక్నిక్‌ విద్యార్ధులకు జాబ్‌ మేళా..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ విద్యార్ధుల కోసం జాబ్‌ మేళా నిర్వహిస్తున్నామని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. రైలు రవాణా సేవలను అందించే మేధా సర్వో డ్రైవ్స్‌లో మూడు లక్షల ప్యాకేజీతో వంద మంది ఇంజనీరింగ్‌ ట్రైనీలను తీసుకోనున్నట్లు వివరించారు. ఈనెల 26,27 తేదీలలో విజయవాడలోని ఐలాపురంలోని కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించే ఇంటర్వూలకు విద్యార్ధులు హాజరు కావచ్చన్నారు.

- Advertisement -

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్స్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ బ్రాంచ్‌లలో 2022 సంవత్సరంలో ఉత్తీర్ణులు అయిన వారంతా నేరుగా వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం 9346207421, 6309953362 నంబర్లను సంప్రదించవచ్చన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement