Friday, April 26, 2024

ఐపీఎల్‌లో జియో సినిమాకు కాసులపంట..

వయాకామ్‌ 18 యాజమాన్యంలోని జియోసినిమా టాటా ఐపీఎల్‌ డిజిటల్‌ మీడియా హక్కులకు సంబంధించి టోర్నమెంట్‌ మొదటి వారంలో ప్రకటనల కోసం 23 స్పాన్సర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంది. వారాంతంలో ఒక్కో వీక్షకుడి నుంచి 57 నిముషాల సగటు సమయాన్ని జియో సినిమా నమోదు చేసింది.

గతసీజన్‌ మొదటి వారంతో పోల్చితే దాదాపు 60శాతం పెరుగుదల. వయాకామ్‌ 18స్పోర్ట్స్ సీఈవో అనిల్‌ జయరాజ్‌ మాట్లాడుతూ, బ్రాండ్‌లు టెలివిజన్‌ ప్రకటనల కంటే ఎక్కువ కచ్చితత్వం, ఖర్చు-ప్రభావం దృష్ట్యా ఎక్కువ మంది ప్రకటనకర్తలు డిజిటల్‌వైపు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. 2023లోఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ను ఉచితంగా ప్రసారం చేస్తున్నామని, మొదటి వారంలో వీక్షకుల సంఖ్య 375 కోట్లకు చేరిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement