Thursday, May 2, 2024

అప్పుల బాధ‌తో జ్యువెల్ల‌ర్స్ య‌జ‌మాని ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. ఎంజీఎంకు త‌ర‌లింపు

వరంగల్ జిల్లా నర్సంపేటలో జ్యువెల్ల‌ర్స్ షాపు య‌జ‌మాని ఆత్మ‌హ‌త్య‌య‌త్నం చేశాడు. జిల్లా కేంద్రంలోని అంబేద్క‌ర్ సెంటర్ లో గోల్డ్ షాపు నిర్వహించే రాగి రాజేంద్ర ప్రసాద్ ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డ‌ట్టు తెలుస్తోంది. కుటుంబ క‌ల‌హాలు, అప్పుల భాధతోనే రాజేంద్ర‌ప్ర‌సాద్ గొంతు కోసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డ‌ట్టు స‌మాచారం.

అయితే.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తి ప్ర‌స్తుతం ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయ‌మ్మీద‌ పట్టణ సీఐ పులి రమేష్ గౌడ్ ను వివరణ కోరగా త‌మ‌కు ఎటువంటి సమాచారం లేద‌న్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement