Thursday, May 2, 2024

అక్టోబర్‌లో జెట్‌ఎయిర్‌వేస్‌ మళ్లీ టేకాఫ్‌.. ప్రకటించిన నరేశ్ ఆగర్వాల్

మూడేళ్లుగా నింగికి దూరమైన ప్రైవేట్‌ ఎయిర్ జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు త్వరలో టేకాఫ్‌ తీసుకోనున్నాయి. వచ్చే సెప్టెంబర్‌ నెలాఖరులోగానీ, అక్టోబర్‌లోగానీ జెట్‌ ఎయిర్‌వేస్‌ సేవలు ప్రారంభం కానున్నాయి. ఎయిర్‌ ఆపరేటర్‌ సర్టిఫికెట్‌ రెన్యూవల్‌ కోసం దరఖాస్తు చేశామని సంస్థ సీఈవో సంజీవ్‌కపూర్‌ తెలిపారు. జులై, సెప్టెంబర్‌ త్రైమాసికంలో కార్యకలాపాలు ప్రారంభించడానికి చర్యలు చేపట్టామని అన్నారు. వచ్చేనెల ప్రారంభంలో ఎయిర్‌ ఆపరేటర్‌ సర్టిఫికెట్‌ లభిస్తుందని జెట్‌ ఎయిర్‌వేస్‌ భావిస్తున్నది. నెలాఖరులో విమానాల టెస్టింగ్‌ ప్రారంభం అవుతుందని సంజీవ్‌కపూర్‌ అన్నారు. విమాన సర్వీసుల పున:ప్రారంభం చాలా సంక్లిష్టం, సుదీర్ఘ కాలం జరిగే ప్రక్రియ అయినా తమ కృషి తుది దశకు చేరుకున్నదని తెలిపారు. ఎయిర్‌ ఆపరేటర్‌ పర్మిట్‌ (ఏవోపీ) తర్వాత ఆపరేషన్ల నిర్వహణ ప్రారంభం అవుతుందన్నారు. కాగా 1990వ దశకం ప్రారంభంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రారంభమైంది. పారిశ్రామికవేత్త నరేశ్‌ అగర్వాల్‌ సారథ్యంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ విమాన సర్వీసులు మొదలయ్యాయి.

మహారాజాగా పేరొందిన ఎయిరిండియాకు ప్రత్యామ్నాయంగా జెట్‌ ఎయిర్‌వేస్‌ తీసుకొస్తున్నట్లు అప్పట్లో నరేశ్‌ అగర్వాల్‌ ప్రకటించారు. ఒకానొక దశలో జెట్‌ ఎయిర్‌వేస్‌ 120 విమానాలు నడిపింది. ‘ది జాయ్‌ ఆఫ్‌ ప్లయింగ్‌’ ట్యాగ్‌లైన్‌తో జెట్‌ ఎయిర్‌వేస్‌ సేవలు నిర్వహించింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ సేవలు జెట్‌ స్పీడ్లో దూసుకెళ్తున్న వేళ 650 విమానాలను నడిపింది. కానీ మూత పడే నాటికి కేవలం 16 విమానాలకు పరిమితమైంది. 2019 మార్చి నెలాఖరు నాటికి జెట్‌ ఎయిర్‌వేస్‌ భారీ రుణ భారంతో రూ.5,535.75 కోట్ల నష్టాలను చవి చూసింది. 2019 ఏప్రిల్‌ 17న మూత పడినట్లు అధికారికంగా ప్రకటించారు. నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సిఎల్‌టి) ఆధ్వర్యంలో వేలం బిడ్‌ను జలాన్‌ కల్రాక్‌ కన్సార్టియం గతేడాది జూన్‌లో గెలుచుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement