Thursday, April 18, 2024

ఢిల్లీలో ఇఫ్తార్ విందు.. పాల్గొన్న టీఆర్ ఎస్ లీడ‌ర్లు..

ఢిల్లీలో ఇవ్వాల టీఆర్ ఎస్ లీడ‌ర్లు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. రేపు జ‌ర‌గ‌నున్న నిర‌స‌న దీక్ష కోసం పెద్ద ఎత్తున తెలంగాణ నుంచి ఢిల్లీకి చేరుకున్న ప్ర‌జాప్ర‌తినిధులు, లీడ‌ర్ల‌కు దీక్షా ప్రాంగణంలో TRS పార్టీ రాష్ట్ర నాయకుడు, GHMC మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఆద్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కాగా, మైనార్టీ, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీలు కే. కేశవరావు, జోగినిపల్లి సంతోష్ కుమార్, నామా నాగేశ్వరరావు, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలే యాదయ్య, వివిధ కార్పొరేషన్ చైర్మన్ లు, TRS పార్టీ రాష్ట్ర కమిటీ మైనార్టీ నాయకులు జాంగిర్ నిరంజన్ వలి, TRSV రాష్ట్ర నాయకుడు ఫరీదుద్దీన్ తో పాటు ప‌లువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement