Friday, April 26, 2024

రాజీవ్ గాంధీ విగ్రహం తొలగింపుపై భగ్గుమన్న కాంగ్రెస్

జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. రాజీవ్ గాంధీ విగ్రహం తొలగింపును కాంగ్రెస్ నేతలతో కలిసి జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి ఆదివారం రాత్రి అడ్డుకున్నారు. ఈ సందర్బంగా జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ దేశం కోసం ప్రాణమిచ్చిన నేత రాజీవ్ గాంధీ అని అన్నారు. అటువంటి మహనీయుడి విగ్రహంను తొలగించేందుకు చేస్తున్న కుట్రలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. అవసరమైతే ప్రాణాలు కూడా ఇస్తామని తేల్చి చెప్పారు. నేడు టీపీసీసీ నేత రేవంత్ రెడ్డి పాలకుర్తికి వచ్చే అవకాశాలున్నాయని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement