Thursday, March 28, 2024

Covid-19: దేశంలో వెయ్యికి దిగువ కేసులు.. కొత్తగా 891 మందికి కరోనా

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. గడిచిన కొద్ది రోజులుగా వెయ్యి లోపే కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 861 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 929 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే, కేవలం ఆరుగురు మాత్రమే కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,36,132 కు చేరింది. ఇందులో  4,25,03,383 కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 11,058 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా పాజిటివిటి రేటు 97.67 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,85,74,18,827 కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement