Saturday, May 18, 2024

కౌలు రైతు శంక‌రం కుటుంబాన్ని ప‌రామ‌ర్శించి – రూ.ల‌క్ష అంద‌జేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్

జ‌న‌సేన కౌలు రైతు భ‌రోసా యాత్ర తూర్పుగోదావ‌రి జిల్లాల్లో ప్రారంభ‌మైంది. సాగు క‌లిసి రాక ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డ కౌలు రైతుల కుటుంబాల‌కు అండ‌గా నిలిచేందుకు జ‌న‌సేన ఈ యాత్ర‌ని చేప‌ట్టింది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ శ‌నివారం ఉద‌యం హైద‌రాబాద్ నుంచి రాజ‌మ‌హేంద్రవ‌రం చేరుకుని న‌గ‌రం నుంచే ఈ యాత్రని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఇటీవ‌లే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డ కౌలు రైతు పచ్చిమళ్ళ శంకరం కుటుంబాన్ని ఆయ‌న ప‌రామ‌ర్శించారు. శంక‌రం ఫొటోకు నివాళి అర్పించిన ప‌వ‌న్‌… ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడారు. అనంత‌రం జ‌న‌సేన కౌలు రైతు భ‌రోసా యాత్ర‌లో ప్ర‌క‌టించిన రూ.1 ల‌క్ష‌ను ఆయ‌న బాధిత కుటుంబ స‌భ్యుల‌కు అంద‌జేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement