Sunday, May 26, 2024

Support : రాష్ట్రపతి ఎన్నికల్లో యశ్వంత్​కే తమ సపోర్ట్​.. వెల్లడించిన ఆమ్​ ఆద్మీ పార్టీ

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకే తమ మద్దతు ఉంటుందని ఆప్​ ఎంపీ సంజయ్ సింగ్ శనివారం తెలిపారు. పార్టీ రాజకీయ సలహా కమిటీ (పీఏసీ) భేటీ తర్వాత ఈ విషయాన్ని ఆయన మీడియాకు వెల్లడించారు. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎంపిక చేసిన అభ్యర్థి ద్రౌపది ముర్ముతో దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవికి సిన్హా పోటీలో ఉన్నారు.

తాము ఓ గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్మును తప్పకుండా గౌరవిస్తామని, కానీ, ప్రతిపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు తమ మద్దతు ఉంటుందని సింగ్ చెప్పారు. ఈ సమావేశానికి ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, పంజాబ్ ఎంపీ రాఘవ్ చద్దా, ఎమ్మెల్యే అతిషి, ఇతర పీఏసీ సభ్యులు హాజరయ్యారు.

కాగా, రాష్ట్రపతి ఎన్నికకు సోమవారం ఓటింగ్ జరగనుంది. ఢిల్లీ, పంజాబ్ రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలను కలిగి ఉన్న ఏకైక బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీగా  ఆమ్​ఆద్మీ పార్టీ ఉంది. ఇందులో ఢిల్లీ నుంచి ముగ్గురు సహా రెండు రాష్ట్రాల నుంచి 10 మంది రాజ్యసభ ఎంపీలున్నారు. అలాగే పార్టీకి పంజాబ్‌లో 92, ఢిల్లీలో 62, గోవాలో ఇద్దరు సహా మొత్తం 156 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement