Sunday, May 5, 2024

ఇవ్వాల్టి మ్యాచ్‌తో కొత్త రికార్డ్ లిస్ట్‌లోకి చేరిన జడేజా…

ఐపీఎల్ 16వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న రవీంద్ర జడేజా ఇవ్వాల తన 300వ టీ20 మ్యాచ్‌ను ఆడుతున్నాడు. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా జరుగున్న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ద్వారా రవీంద్ర జడేజా తన కెరీర్‌లో 300వ టీ20 మ్యాచ్‌ను ఆడుతున్నాడు. కాగా, 300 టీ20 మ్యాచ్‌లు ఆడిన భారత ఆటగాళ్ల జాబితాలో రవీంద్ర జడేజా చేరాడు. 414 టీ20 మ్యాచ్‌లతో రోహిత్ శర్మ ఈ లిస్ట్‌లో నంబర్ వన్ స్థానంలో ఉండగా.. ఇప్పటివరకు మొత్తం ఎనిమిది మంది భారత ఆటగాళ్లు 300 లేదా అంతకంటే ఎక్కువ టీ20లు ఆడారు.

టీ20ల్లో 300 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన భారత ఆటగాళ్లు…

- Advertisement -

రోహిత్ శర్మ – 414 టీ20 మ్యాచ్‌లు.
దినేష్ కార్తీక్ – 381 టీ20 మ్యాచ్‌లు.
మహేంద్ర సింగ్ ధోని – 369 టీ20 మ్యాచ్‌లు.
విరాట్ కోహ్లీ – 368 టీ20 మ్యాచ్‌లు.
సురేష్ రైనా – 368 టీ20 మ్యాచ్‌లు.
శిఖర్ ధావన్ – 322 టీ20 మ్యాచ్‌లు.
రవి అశ్విన్ – 304 టీ20 మ్యాచ్‌లు
రవి జడేజా – 300 టీ20 మ్యాచ్‌లు.

Advertisement

తాజా వార్తలు

Advertisement