Monday, May 6, 2024

జ‌బ‌ర్ద‌స్త్ ను వీడ‌నున్న సుడిగాలి సుధీర్ టీం..ఏం జ‌రిగింది…

జ‌బ‌ర్ధ‌స్త్ ఈ వేదిక ఎంతో మంది క‌మెడియ‌న్స్ జీవితాల్లో వెలుగులు నింపింది. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎక్కడో మిమిక్రీ ఆర్టిస్ట్ గా పని చేస్తున్న సుధీర్ జబర్దస్త్ ద్వారా సుడిగాలి సుధీర్ గా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రస్తుతం బుల్లితెర స్టార్ గా మారిపోయిన సుధీర్ జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చినట్లు స‌మాచారం. అయితే జబర్దస్త్ కార్యక్రమం నుంచి సుధీర్ బయటకు రావడంతో పాటు అతనితో పాటు ఎంతో సన్నిహితంగా ఉండే గెటప్ శీను, ఆటో రాంప్రసాద్ కూడా బయటకు రావాలని భావించినట్లు టాక్.కాగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కమెడియన్స్ ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్ళిపోతే కార్యక్రమం రేటింగ్ అమాంతం పడిపోతాయని నిర్వాహకులు భావిస్తున్నారు.

ప్రతి సంవత్సరం జబర్దస్త్ కమెడియన్స్ తో అగ్రిమెంట్ పై సంతకం చేయించుకునే మల్లెమాల సంస్థ ఈ ఏడాది కూడ కమెడియన్స్ తో అగ్రిమెంట్ పై సంతకాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయగా సుడిగాలి సుధీర్ అగ్రిమెంట్ పై సంతకం చేయడానికి నిరాకరించార‌ట‌. ఇన్ని రోజులు సుడిగాలి సుధీర్ ,మిగతా కమెడియన్స్ కేవలం జబర్దస్త్ కార్యక్రమం పై మాత్రమే ఆధారపడి పని చేశారు. అయితే ఈ కార్యక్రమం ద్వారా వీరికి ఎంతో ఫేమ్ రావడంతో వీరికి ఎన్నో సినిమాలు,మరి ఇతర కార్యక్రమాలలో ఆఫర్లు లభించటం వల్ల కేవలం జబర్దస్త్ కార్యక్రమానికి మాత్రమే పరిమితం కాకూడదని భావించినట్లు ఉన్నారు. అందుకోసమే జబర్దస్త్ అగ్రిమెంట్ పై సంతకం పెట్టడం అని చెప్పడంతో ఈ విషయంలో సుడిగాలి సుదీర్ ని ఏమీ అనడానికి కూడా కారణాలు లేకపోవడంతో మల్లెమాల సంస్థ‌ కూడా సైలెంట్ అయ్యారట‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్..రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం..ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement