Sunday, May 19, 2024

అనురాగ్ క‌శ్య‌ప్, తాప్సీ ఇళ్ల‌పై ఐటి దాడులు..

ముంబై: బాలీవుడ్ నిర్మాత‌లు అనురాగ్ క‌శ్య‌ప్‌, వికాశ్ భ‌ల్, మ‌ధు మంతెన‌, హీరోయిన్ తాప్సీ ల‌కు చెందిన ఇళ్ల‌పై ఐటి శాఖ దాడులు నిర్వ‌హించింది.. ఏక కాలంలో వారి ఇళ్ల‌పై, కార్యాల‌యాల‌పై ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. ఆదాయ‌ప‌న్ను ఎగ‌వేత కేసులో ఈ త‌నిఖీలు జ‌రుగుతున్న‌ట్లు ఐటీ శాఖ వెల్ల‌డించింది. ఫాంథ‌మ్ ఫిల్మ్స్‌తో పాటు 22 ప్ర‌దేశాల్లో ఐటీ శాఖ నేటి ఉద‌యం నుంచి సోదాలు కొన‌సాగిస్తున్న‌ది. ఈ దాడుల‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం ఇంకా అందాల్సి ఉన్న‌ది.

Advertisement

తాజా వార్తలు

Advertisement