Friday, April 26, 2024

ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో సంబంధం లేదు.. ఎంపీ మాగుంట వివరణ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై ఆయన వివరణ ఇచ్చారు. లిక్కర్ స్కామ్ లో తమపై కుట్రపూరితంగా మాట్లాడుతున్నారన్నారు. తాను, తన కుమారుడు ఢిల్లీ లిక్కర్ బిజినెస్ లో డైరెక్టర్లుగా లేమన్నారు. 70ఏళ్లుగా ఈ వ్యాపారంలో ఉన్నామన్నారు. ఢిల్లీలోని 32 జోన్లలో రెండు జోన్లలో తమ బంధువులకు షాపులున్నాయన్నారు. ఈడీ సోదాల్లో ఎలాంటి డాక్యుమెంట్లు లభించలేదన్నారు. వ్యాపారాలతో రాజకీయాలను ముడిపెట్టొద్దన్నారు. తమ రాజకీయ జీవితానికి ఎలాంటి అడ్డంకుల్లేవన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement