Friday, May 17, 2024

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థపై ఐటీ దాడులు.. ఢిల్లీ, హైదరాబాద్‌తో పాటు ఆరు చోట్ల సోదాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : హైవేలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రసిద్ధి చెందిన కేఎన్‌ఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపనీపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు జరిపారు. ఢిల్లీతో పాటు హైదరాబాద్‌లోని ఆరు చోట్ల, వరంగల్‌, ములుగు, జనగాంలలోని సంస్థ కార్యాలయాలలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. సంస్థ కార్యకలాపాలపై క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు కొన్ని డాక్యుమెంట్లు, కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌లు, ఫైళ్ళను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా కొంత నగదును కూడా అధికారులు సీజ్‌ చేశారని తెలుస్తోంది. అయితే సంస్థపై దాడులను దృవీకరిస్తున్న అధికారులు కారణాలేమిటి? స్వాధీనం చేసుకున్న వాటి వివరాలు, సంస్థ అక్రమాలకు సంబంధించిన వివరాలను తెలిపేందుకు నిరాకరిస్తున్నారు. దాడుల అనంతరం స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, ఇతరత్రా వివరాలను పరిశీలించి సరి చూసిన అనంతరం మొత్తం వివరాలను తెలియజేస్తామని చెబుతున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement