Saturday, May 4, 2024

IPL 2022: రాజ‌స్థాన్ బౌలింగ్ కోచ్ గా మ‌లింగా.. ప్ర‌క‌టించిన యాజ‌మాన్యం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమైన ఏడాది చాంపియన్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు.. ఆ తర్వాత ఆ స్థాయి ప్రదర్శన కనబరచలేదు. ఆ తర్వాత ప్లేఆఫ్స్‌కు వెళ్లడం కూడా గగనమే అవుతోంది ఈ టీమ్‌కు. అయితే ఈసారి ఎలాగైనా గట్టిగా పోరాడాలని నిర్ణయించుకున్న ఆర్ఆర్ యాజమాన్యం.. మెగా వేలంలో మంచి ఆటగాళ్లను ద‌క్కించుకుంది.

అంతేకాకుండా మాజీ శ్రీలంక పేసర్, ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన లసిత్ మలింగను ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా మలింగ రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత ఆటకు వీడ్కోలు పలికి బౌలింగ్ కోచ్‌గా మారాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement