Friday, April 26, 2024

ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకే.. బడ్జెట్‌పై సోము వీర్రాజు కామెంట్స్​

అమరావతి, ఆంధ్రప్రభ: ముందస్తు ఎన్నికల వ్యూహంతోనే ఏపీ ప్రభుత్వం బడ్జెట్‌ ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన స్పందిస్తూ రాష్ట్ర బడ్జెట్‌లో ఏ ప్రాంత అభివృద్ధి గురించి ప్రస్తావించలేదని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌ ను ప్రశ్నించిన సీఎం జగన్‌ రాష్ట్ర బడ్జెట్‌ ను ప్రాంతాల వారీగా ఎందుకు చూపలేదని నిలదీశారు. ఇది మసిపూసి మారేడుకాయ చేసే బడ్జెట్‌ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ లోటు- రూ.5 వేల కోట్లకు చేరిందన్న విషయాన్ని గమనించాలని అన్నారు.

అప్పులు చేసి పథకాలకు పంచేలా ఉన్నట్లు ఆరోపించారు. అప్పులు ఎగ్గొట్టేందుకే ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చేసిన అప్పులపై ఎన్నిసార్లు నిలదీసినా ప్రభుత్వం నుంచి స్పందన కరవైందని వ్యాఖ్యానించారు. ఇప్పటి-కై-నా వాస్తవ అప్పులు ప్రజల ముందుంచాలని వీర్రాజు డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement