Sunday, May 5, 2024

వివిధ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం..

వివేక్‌నగర్‌, ప్రభన్యూస్ : దుర్గాబాయ్‌ దేశ్‌ ముఖ్‌ మహిళాసభ (ఏఎంఎస్‌) కాలేజీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌, మీడియా ఎడ్యుకేషన్‌ (ఓయూ క్యాంపస్‌) లో వివిధ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ జగన్మోహన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 2022-23 గాను బిఏ కర్ణాటక సంగీతం, ఎంఏ కర్ణాటక సంగీతం సిలబస్‌ లెర్నింగ్‌ ఆన్‌లైన్‌ కోర్స్‌, రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్‌ లైట్‌ మ్యూజిక్‌, ఒక సంవత్సరం సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ కర్ణాటక గాత్ర సంగీతం, ఒక ఏడాది కూచిపూడి డ్యాన్స్‌, ఒక ఏడాది సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ పెయింటింగ్‌, యాంకరింగ్‌, యాక్టింగ్‌, డబ్బింగ్‌ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. వయస్సుతో సంబంధం లేకుండా అందరూ దరఖాస్తు చేసుకోవచ్చని జగన్మోహన్‌ వెల్లడించారు.

యాంకరింగ్‌కు 18 నుంచి 40 ఏళ్ళవారు, డబ్బింగ్‌, యాక్టింగ్‌కు 18 నుంచి 30 ఏళ్ళవారు, న్యూస్‌ రీడింగ్‌కు 18 నుంచి 25లోపు వాళ్ళు, జర్నలిజం, ల్యాబ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కోర్స్‌ కోసం 18 నుంచి 30 ఏళ్ళ లోపు వారు దరఖాస్తులు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. బిఏ మ్యూజిక్‌ ఫుల్ టైమ్‌, ఎంఎ మ్యూజిక్‌ (డిస్టెన్స్‌) కోర్సులకు మహిళలు మాత్రమే అర్హులని ఆయన తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులు ఈ నెల 25వ తేదీలోగా పంపాలని, మిగతా వివరాలకు 040-27070052 లేదా 9441768811, 9177581329 ఫోన్‌ నెంబర్‌ లలో సంప్రదించవచ్చని జగన్మోహన్‌ వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement