Sunday, May 5, 2024

రామగుండంలో వాహనాల తనిఖీ.. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడ్డ వాహనాలు సీజ్

రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో పోలీసులు ఆకస్మికంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి అర్ధరాత్రి రెండు గంటల వరకు వాహనాల తనిఖీ చేపట్టాలని రామగుండం పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి ఆదేశాల మేరకు రెండు జిల్లాల్లో పోలీసులు పెద్ద ఎత్తున వాహనాల తనిఖీలు చేపట్టారు.

పోలీసులు వాహనాల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించడంతోపాటు బ్రీత్ అనలైజర్ల ద్వారా పరీక్షలు చేపట్టారు మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసు నమోదు చేయడంతో పాటు వాహనాలు సీజ్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement