Sunday, April 28, 2024

ఎనిమిదేళ్ల‌లో ఎన‌లేని కీర్తి : ఎమ్మెల్సీ మ‌ధుసూద‌న్

తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిదేళ్ల‌లో ఎన‌లేని కీర్తి సాధించింద‌ని ఎమ్మెల్సీ మ‌ధుసూద‌న్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భం గా ఎమ్మెల్సీ , ఖమ్మం జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు మధుసూదన్ తెలంగాణ రాష్ట్ర సమితి ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయము తెలంగాణ భవన్ నందు తెలంగాణా సింద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం జాతీయ పతాక ఆవిష్కరణ గావించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆద‌ర్శంగా నిలుస్తోంద‌న్నారు. ఎనిమిదేళ్ల‌లో ఎన‌లేని కీర్తి సాధించింద‌న్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు , జిల్లా రైతు బంధు కోఆర్డినేటర్ నల్లమల్ల వెంకటేశ్వర్లు, ఉద్యమ కారులు శేషగిరి రావు, మద్దెల విజయ్, పగడాల నరేందర్, లింగబోయిన సతీష్, నాయకులు ముత్యాల అప్పారావు, చుంచు విజయ్ కుమార్, చావా శ్రీనివాస్, చావా వేణు, చామకూరి రాజు, రేపాకుల రవి, పార్టీ కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement