Tuesday, May 7, 2024

ఖతర్‌లో అమానుష ఘటన.. కుక్కలపై కాల్పులు..

ఖతర్‌లో జరిగిన ఓ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకటి కాదు… రెండు కాదు… ఏకంగా 29 మూగజీవాలను కడతేర్చారు ఇద్దరు కిరాతకులు. ఓ చిన్నారిని కుక్క కరిచిందనే నెపంతో దాదాపు 29 వీధి కుక్కలను ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. ఈ దారుణం ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఖతర్‌ దేశంలోని దోహాలో నివసిస్తున్న ఓ వ్యక్తి కుమారుడిపై కుక్క దాడిచేసి, గాయపరిచింది. ఆ తర్వాత ఇతర కుక్కలన్నీ సమీపంలోని ఓ ఫ్యాక్టరీలోకి ప్రవేశించాయి. వెంటనే ఇద్దరు వ్యక్తులు ఆయుధాలతో ఆ ఫ్యాక్టరీలోకి ప్రవేశించారు. అక్కడున్న సెక్యూరిటీ గార్డును తమ వద్దనున్న ఆయుధాలతో బెదిరించి, లోపలికి ప్రవేశించి అక్కడున్న కుక్కలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

సెక్యూరిటీ సిబ్బంది కాల్పులను ఆపడానికి ప్రయత్నించినా వారిని కూడా బెదిరించారు. ఈ ఘటనలో వీధికుక్కలు 29 మృతి చెందగా, మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. మరణించిన వాటిలో చిన్నచిన్న పిల్లలు కూడా వున్నాయని, అవి ఎంతో ముద్దుగా, స్నేహపూర్వకంగా వుంటాయని స్థానికులు అంటున్నారు. నిజానికి అదిడశునక సంరక్షణ కేంద్రం. అక్కడ నివసించే కుక్కలు ఎవరికీ హాని తలపెట్టవని, అవి చాలా స్నేహపూర్వకంగా ఉంటాయని, వాటిని అందరూ ఇష్టపడతారని, అటువంటి కుక్కలను ఆయుధాలతో కాల్చి చంపడాన్ని నెటిజన్లు, జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement