Thursday, April 25, 2024

సూపర్ 4 లీగ్ మ్యాచ్‌లో జపాన్‌పై భారత్‌ విజయం

ఆసియా కప్‌ హాకీలో తొలి సూపర్ 4 లీగ్ మ్యాచ్‌లో జపాన్‌పై 2-1 తేడాతో భారత హాకీ పురుషుల జట్టు విజయం సాధించింది. పూల్‌ దశలో జపాన్‌పై ఓటమికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. భారత్‌ తరపున మంజీత్, పవన్‌ రాజ్‌భర్‌ చెరో గోల్‌ సాధించారు. ఇక మ్యాచ్‌ 18వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ ద్వారా జపాన్‌కు ఏకైక గోల్‌ వచ్చింది. జపాన్ మొదట దూకుడుగా ఆడింది. మ్యాచ్‌ ప్రారంభ నిమిషంలోనే జపాన్ పెనాల్టీ కార్నర్‌ సాధించింది. అయితే పెనాల్టీ కార్నర్‌లో జపాన్ ఎటువంటి గోల్ సాధించలేకపోయింది. అనంతరం భారత్‌ మ్యాచ్‌పై పట్టుబిగించింది. ఇక భారత్ తన తదుపరి సూపర్ 4 దశ మ్యాచ్‌లో ఆదివారం మలేషియాతో తలపడనుంది

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement