Sunday, April 28, 2024

ఆస్ట్రేలియాలో భార‌తీయ విద్యార్థిపై దాడి-11క‌త్తిపోట్లు-ప‌లు స‌ర్జ‌రీలు

భార‌తీయ విద్యార్థిని 11సార్లు క‌త్తితో పొడిచాడు ఓ దుండ‌గుడు.ఈ సంఘ‌ట‌న ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్‌ న్యూ సౌత్‌ వేల్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్న శుభమ్‌ గార్గ్‌ను 11 సార్లు కత్తితో పొడిచారు. అక్టోబర్‌ ఆరవ తేదీన ఆ అటాక్‌ జరిగింది. శుభమ్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటననకు విద్వేష దాడిగా గమనిస్తున్నారు. శుభమ్‌ పేరెంట్స్‌ యూపీలోని ఆగ్రాలో నివసిస్తున్నారు. ఆస్ట్రేలియా వెళ్లేందుకు వాళ్లు వీసా కోసం ప్రయత్నిస్తున్నారు. ఐఐటీ మద్రాసులో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకున్న శుభమ్‌.. సెప్టెంబర్‌ ఒకటో తేదీన ఆస్ట్రేలియా వెళ్లాడు.అక్టోబర్‌ ఆరో తేదీన రాత్రి 10.30 నిమిషాలకు రోడ్డుపై వెళ్తున్న శుభమ్‌ను ఓ వ్యక్తి అడ్డగించాలని, అతని వద్ద ఆ వ్యక్తి డబ్బులు డిమాండ్‌ చేశాడని తెలుస్తోంది. డబ్బులు ఇవ్వలేమని చెప్పినప్పుడు, ఆ దుండగుడు కత్తితో శుభమ్‌పై దాడి చేశాడు. ముఖం, ఛాతి, కడుపులో శుభమ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో 27 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. శుభమ్‌కు పలు సర్జరీలు అయినట్లు ఆమె సోదరి తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement