Friday, April 26, 2024

Breaking: ప‌డ‌వ మునిగి.. 8మంది చిన్నారుల మృతి

ప‌డ‌వ మునిగిపోవ‌డంతో 8మంది చిన్నారులు మృతిచెంద‌గా.. మ‌రో ముగ్గురు గ‌ల్లంతైన ఘ‌ట‌న‌ కంబోడియా దేశంలో చోటుచేసుకుంది. ఈరోజు కంబోడియాలోని మేకాంగ్ నదిలో పడవలో పిల్లలు ప్రయాణిస్తుండగా ఓవర్ లోడ్ వల్ల అదికాస్తా నీటిలో మునిగింది. ఈ పడవ ప్రమాదంలో 8మంది పిల్లలు మరణించగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు.

ఈ ప్రమాదంలో మరణించిన పిల్లల వయసు 12 నుంచి 15 ఏళ్ల లోపు వయసు వారేనని అధికారులు చెప్పారు. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు బోటు ఆపరేటర్లు, ఇద్దరు విద్యార్థులు బయటపడ్డారు. భారీ వరదల వల్ల పడవ మునిగిన ఘటనలో పిల్లలు మరణించిన ఘటనపై కంబోడియా ప్రధానమంత్రి హున్ సేన్ సంతాపం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement