Thursday, March 28, 2024

తిమ్మాంపల్లిలో చైన్ స్నాచింగ్

యల్లనూరు మండల పరిధిలోని తిమ్మoపల్లి గ్రామంలో శుక్రవారం గుర్తు తెలియని దుండగులు చైన్ స్నాచింగ్ పాల్పడ్డారు. గ్రామంలోని కెనరా బ్యాంకు మేనేజర్ అద్దె గృహంలో ఉండేవారు. విధులపై హైదరాబాద్ కు మేనేజర్ వెళ్ళాడు. ఇంట్లో కుటుంబ యజమానురాలు ఒక్కతే ఉండడంతో శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు గేటు తీసి లోనికి వెళ్లి ఆమెను కొట్టి మేడలో 5.5 తులాలు బంగారు గొలుసు లాక్కొని వెళ్లారని బాధితురాలు తెలిపారు. చిత్రావతి నదిలో వరద ఉద్రుతి కారణం గా పోలిస్టేషన్ కు రాలేకపోతున్నట్లు విషయాన్ని పోలీసులకు సమాచారం అందించామని కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement