Friday, April 26, 2024

వెంట వెంటనే రెండు వికెట్లు చేజార్చుకున్న టీమిండియా..

ఇంగ్లాండుతో రెండో టెస్ట్ లో టీమిండియా తొలి రోజు ఆదిపత్యం కనబర్చింది. కాని రెండో రోజు ఆది లోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఆట ప్రారంభమైన తొలి ఓవర్ లో రాహుల్ అవుట్ అయ్యాడు. ఆ తరువాత అజింక్యా రహానే కూడా ఔటయ్యాడు. దీంతో టీమిండియా భారీ స్కోరుకు కన్నం పడింది. మొదట 129 పరుగులు చేసిన కేఎల్‌ రాహుల్‌ ఓలి రాబిన్‌సన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 91 ఓవర్‌ రెండో బంతికి సిబ్లీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత జేమ్స్‌ అండర్సన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 92వ ఓవర్‌ తొలి బంతికే 1 పరుగు చేసిన రహానే రూట్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా 5 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసింది. రిషబ్‌ పంత్‌ 17, జడేజా 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

ఇది కూడా చదవండి: వీడియో: బాయ్‌ఫ్రెండ్ కోసం కొట్టుకున్న ఇద్దరు యువతులు

Advertisement

తాజా వార్తలు

Advertisement