Sunday, April 28, 2024

INDIAనేడు సాఫ‌రీతో తొలి టెస్టు

ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్‌లో భాగంగా ఇవాళ తొలి టెస్టు ప్రారంభం కానుంది. సెంచూరియన్​లో మధ్యాహ్నం 1.30 గంటల నుంచి ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.

1992 నుంచి మొదలు కొని ఇప్పటివరకు 31 ఏళ్లలో ఎనిమిది సార్లు దక్షిణాఫ్రికాలో పర్యటించిన టీం ఇండియా ఒక్కసారి కూడా టెస్ట్ సిరీస్ గెలవలేకపోయింది. ఒకే ఒక్క సారి సిరీస్ “డ్రా” చేసుకొని మిగిలిన ఏడుసార్లు ప్రత్యర్థికి కప్పు అప్పజెప్పింది. ఈసారి ఆ లెక్కలు సరిచేయాలనే ఉద్దేశం తో భారతజట్టు ఉంటే…..అజేయ రికార్డు కొనసాగించాలని ప్రోటీస్ రెడీ అవుతున్నారు.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, రవి అశ్విన్, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, శార్దూల్ ఠాకూర్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసీద్.

దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్గి, డీన్ ఎల్గర్, ఐడెన్ మార్క్‌రామ్, కీగన్ పీటర్సన్, మార్కో యాన్సిన్, వియాన్ ముల్డర్, డేవిడ్ బెడింగ్‌హామ్, ట్రెస్టన్ స్టబ్స్, కైల్ వరెన్ని, నాండ్రే బెర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, ఎల్ కేశవ్ మహారాజ్, కగిసో రబడా.

Advertisement

తాజా వార్తలు

Advertisement