Monday, April 29, 2024

India Corona: దేశంలో 3.6 లక్షల కేసులు.. 439 మంది మరణాలు

దేశంలో క‌రోనా కేసుల విజృంభ‌ణ కొన‌సాగుతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించిన తాజా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,06,064 కేసులు న‌మోద‌య్యాయి. క‌రోనాతో 439 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో క‌రోనా నుంచి 2,43,495 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలఅ 22,49,335 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 20.75 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 93.07గా ఉన్నట్లు కేంద్రం పేర్కొంది.  

దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,95,43,328కి చేరింది. ఇందులో మొత్తం 3,68,04,145 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 4,89,848 మంది కరోనాతో మరణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement