Thursday, May 16, 2024

రెండు వికెట్లు కోల్పోయిన భార‌త్.. క్రీజ్ లో అయ్య‌ర్, సంజు..

శ్రీలంక నిర్దేశించిన 184 పరుగుల విజయ లక్ష్య చేద‌న‌లో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 44 పరుగులకు రెండు కీలక వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్క పరుగు మాత్రమే చేసి చమీర బౌలింగులో బౌల్డ్ కాగా, గత మ్యాచ్‌లో ఇరగదీసిన ఇషాన్ కిషన్ 16 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.

క్రీజులో కుదురుకున్న శ్రేయాస్ అయ్యర్అ డపాదడపా బౌండరీలు బాదుతూ అర్థ సెంచ‌రీ చేసి స్కోరు బోర్డును ముందుకు కదిలిస్తున్నాడు. సంజు శాంసన్ నిదానంగా ఆడుతూ అతడికి అండగా ఉన్నాడు. ప్రస్తుతం 12 ఓవర్లు ముగిశాయి. భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. టీమిండియా విజయానికి ఇంకా 75 పరుగులు అవసరం కాగా, 47 బంతులు మిగిలి ఉన్నాయి. చేతిలో ఇంకా 8 వికెట్లు ఉన్నాయి. అయ్యర్ 64, శాంసన్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement