Saturday, May 18, 2024

యూకో బ్యాంక్‌ క్రెడిట్‌ క్యాంప్‌..

యూకో (యూసీఓ) బ్యాంక్‌ ఆధర్యంలో బెంగళూరులోని జింఖానాలో మెగా క్రెడిట్‌ క్యాంప్‌ నిర్వహించింది. శుక్రవారం జరిగిన ఈ కస్టమర్‌ మీట్‌లో స్థానిక శాఖల నుంచి ఎంఎస్‌ఎంఈ రుణగ్రహీతలు పాల్గొన్నారు. వీరికి రూ.17కోట్ల మేరకు రుణాల మంజూరు లేఖలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్‌ఐడీబీఐ నుంచి డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ చంద్రమౌళి హాజరై జ్యోతి ప్రజలనతో కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా యూకో బ్యాంక్‌ బెంగళూరు డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌-జోనల్‌ హెడ్‌ రవిశంకర్‌ నారాయణ్‌ మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈ రంగానికి అవసరమైన ఆర్థిక అవసరాల కోసం బ్యాంక్‌ చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. చిన్న వ్యాపారులు, మహిళా పారిశ్రామికవేత్తలు, వస్త్రవ్యాపారులు మొదలైనవారు ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించేందుకు సహాయపడేవిధంగా మంజూరు చేసిన రుణాల లేఖలను అందజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement