Friday, May 17, 2024

ఆసియన్‌ హాకీ కప్‌లో భారత్ జోరు.. రేపే సెమీఫైనల్ మ్యాచ్

మెన్స్ ఆసియన్‌ హాకీ 5ఎస్‌ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ లో భారత పురుషుల జట్టు.. ఎలైట్ గ్రూప్ లో జపాన్‌లతో జ‌రిగిన రెండో మ్యాచ్ లో 35-1 స్కోర్ తో చిత్తు చేసి సెమీస్ లోకి దూసుకెళ్లింది. అంత‌కుముందు మ‌లేషియాతో జ‌రిగిన మ్యాచ్ లో 7-5 స్కోర్ తో భార‌త్ విజ‌యం సొంతం చేసుకుంది.

వ‌రుస‌గా రెండు విజయాలతో, భారత్ 12 పాయింట్లతో ఎలైట్ పూల్ టేబుల్ లో రెండవ స్థానంలో నిలిచింది. దీంతో సెమీఫైనల్‌కు నేరుగా అర్హత సాధించింది. కాగా, 13 పాయింట్ల‌తో మొద‌టి స్థానంలో పాకిస్తాన్ ఉంది. ఇక ఈ టోర్నీలోని సెమీఫైనల్ మ్యాచ్ లు రేపు (శనివారం) ప్రారంభం అవుతాయి. అయితే, ఫస్ట్ సెమీఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఆడ‌నుండ‌గా.. భార‌త్ రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో ఆడ‌నుంది.

కాగా, ఇవ్వాల జ‌రుగుతున్న క్వార్ట‌ర్ ఫైన‌ల్ తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్- ఓమ‌న్, రెండో క్వార్ట‌ర్ మ్యాచ్ లో మ‌లేషియా- ఇరాన్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఇక రేపు జ‌ర‌గున్న సెమీస్ లో తొలి క్వ‌ర్ట‌ర్ లో గెలిచిన జట్టు తో పాక్, రెండో క్వార్ట‌ర్ లో గెలిచిన జట్టు తో భార‌త్ లు త‌ల‌ప‌డ‌నున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement