Tuesday, April 30, 2024

HYD: దేశభక్తి కార్యక్రమాలు నిర్వహించడం గర్వంగా ఉంది.. సామ రంగారెడ్డి

కర్మన్ ఘాట్, సెప్టెంబర్ 1(ప్రభ న్యూస్) : బీజేపీ పార్టీ దేశభక్తి కార్యక్రమాలను నిర్వహించమని చెప్పడం చాలా గర్వకారణమని రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షులు సామ రంగారెడ్డి అన్నారు. ఆజాదిక అమృత్ మహోత్సవ ముగింపు కార్యక్రమంలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో పవిత్ర అమృత వాటికను నిర్మించడానికి దేశంలో ప్రతి గ్రామం నుండి మట్టి సేకరణను నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారన్నారు.

ఈ మేరకు ఎల్బీనగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో అమృత కలశంతో మట్టి, బియ్యపు గింజలను శుక్రవారం సేకరించినట్లు ఆయన తెలిపారు. అనంతరం సామూహికంగా పంచ్ ప్రాన్ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్త రవీందర్ గౌడ్, విజయభాస్కర్, ప్రవీణ్ గౌడ్, కిరణ్ కుమార్, రాకేష్ యాదవ్, శ్రీనివాస్, కృష్ణంరాజు, హరిప్రసాద్, గణేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement